యంగ్ హీరో రానా త్వరలో “అరణ్య” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదే సమయంలో “విరాపర్వం” చిత్రంలో కూడా ఈయన నటిస్తున్నాడు. వేణు దర్శకత్వంలో రూపొందుతున్న “విరాటపర్వం” చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా ఇతర సినిమాలతో పాటు “హిరణ్యకశిప” చిత్రం కూడా సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు రానా సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో సురేష్ బాబు ప్రముఖ అంతర్జాతీ నిర్మాణ సంస్థతో కలిసి దాదాపు 125 కోట్ల బడ్జెట్ తో నిర్మించేందుకు సిద్దం అయ్యారు. పాన్ ఇండియా సినిమాగా నిర్మించనుండగా, తాజాగా చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తైనట్టు తెలుస్తుండగా, త్వరలోనే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
previous post