బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారమై ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు బాలీవుడ్పై దృష్టి పెట్టారు. ముందుగా రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆమె స్టేట్మెంట్ ఆధారంగా దీపికా పదుకొణే, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్, కరీష్మా ప్రకాశ్, రకుల్ ప్రీత్ సింగ్తో పాటు పలువురు ప్రముఖులని విచారించారు. ఇక దీపికా, ఆమె మేనేజర్ కరిష్మాల పాత వాట్సప్ డ్రగ్స్ చాట్ కూడా వెలుగులోకి రావడంతో వీరిద్దరిని ఎన్సీబీ విచారణకు పిలిచింది. తాజాగా డ్రగ్స్ వ్యవహారంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా మేనేజర్ కరీష్మా ప్రకాశ్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. ఇటీవల కరిష్మా ఇంటిలో సోదాలు నిర్వహించగా ఆమె ఇంట్లో 1.7 కిలోగ్రాముల చరాస్, మూడు సీసాల సీబీడీ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కరిష్మాను మరోసారి విచారించేందుకు సమన్లు జారీ చేశారు. మంగళవారం (నవంబర్ 10)న కరీష్మాని పలు కోణాలలో విచారించనుంది ఎన్సీబీ. కరీష్మా రెండు రోజుల క్రితం ఎన్సీబీ ముందు హాజరైన సంగతి తెలిసిందే. కొద్ది రోజులు పరారీలో ఉన్న ఈమె రీసెంట్ గా ఎన్సీబీ ముందుకు వచ్చింది. మంగళవారం ఆమెను మరోసారి విచారించనున్నారు. మరోవైపు ఆదివారం ప్రముఖ నిర్మాత ఫిరోజ్ నదియడ్వాలా భార్య షబానా సయీద్ను ఆదివారం అరెస్ట్ చేశారు. కొద్ది రోజుల క్రితం సబర్బన్లోని జూహూలో గల ఆమె నివాసంలో 10 గ్రాముల గంజాయి దొరకడంతో ఆమెని విచారణ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ రోజు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదాలు జరిపారు. ముంబైలోని అతని ఇంటిని పూర్తిగా తనిఖీ చేసినట్టు తెలుస్తుంది. సోదాలలో ఏమైన డ్రగ్స్ బయట పడితే అతనిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
previous post
next post