telugu navyamedia
సినిమా వార్తలు

“మన్మథుడు-2” కోసం రకుల్ పారితోషికం ఎంతంటే ?

Rakul

రాహుల్ రవీంద్రన్‌ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన‌ తాజా చిత్రం “మన్మథుడు-2”. ఈ చిత్రంలో నాగ్‌ సరసన రకుల్ ప్రీత్‌ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఇప్ప‌టికే విడుద‌లైన‌ టీజ‌ర్‌లు సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ సినిమాలో హీరోయిన్లు స‌మంత‌, కీర్తి సురేష్ ప్ర‌త్యేక పాత్ర‌ల్లో న‌టించారు. ల‌క్ష్మి, రావు ర‌మేష్‌, వెన్నెల కిషోర్‌, ఝాన్సీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించనున్నారు. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైల‌ర్‌ కు మంచి స్పందన వచ్చింది. ఈ ట్రైల‌ర్‌లో కూడా లిప్‌లాక్ స‌న్నివేశాల‌ను చూపించారు. అయితే పేరుతో త‌ప్ప గ‌తంలో వ‌చ్చిన “మ‌న్మ‌థుడు”కు ఈ సినిమాకు ఎలాంటి సంబంధ‌మూ లేద‌ని తాజాగా జ‌రిగిన “మ‌న్మ‌థుడు-2” ట్రైల‌ర్ లాంఛ్ కార్య‌క్ర‌మంలో నాగార్జున చెప్పారు. అంతేకాదు ఇది ఒక ఫ్రెంచ్ సినిమాకు రీమేక్‌. ఆ సినిమా హ‌క్కులు తీసుకుని ఈ సినిమాను రూపొందించామ‌ని నాగార్జున తెలిపారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో రకుల్ పారితోషికం గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి హల్చల్ చేస్తోంది.

వరుస‌గా యంగ్ స్టార్ హీరోల‌తో న‌టిస్తూ అగ్ర‌క‌థానాయిక‌గా కొన‌సాగుతున్న ఢిల్లీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ సీనియ‌ర్ హీరో నాగార్జున‌తో సినిమా చేయడం అనేది ఒక ర‌కంగా పెద్ద రిస్క్‌. ఎందుకంటే సీనియ‌ర్ హీరో ప‌క్క‌న న‌టిస్తే యంగ్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు పెద్ద‌గా రావు. అయినా ర‌కుల్ రిస్క్ చేసింది. గ‌తంలో నాగచైత‌న్య స‌ర‌స‌న హీరోయిన్‌గా నటించిన ర‌కుల్.. ఇప్పుడు చైతూ తండ్రి నాగార్జున‌తో `మ‌న్మ‌థుడు-2`లో న‌టించింది. `మ‌న్మ‌థుడు-2`లో న‌టించినందుకు ర‌కుల్‌కు భారీ మొత్తంలోనే పారితోషికం అందింద‌ట‌. ఇంత‌కుముందెన్న‌డూ లేని రీతిలో `మ‌న్మ‌థుడు-2`లో ర‌కుల్ అత్యంత గ్లామ‌ర‌స్‌గా న‌టించింది. ట్రైల‌ర్‌, టీజ‌ర్ చూస్తే ఆ విషయం అర్థ‌మ‌వుతుంది. ఈ సినిమాలో న‌టించింనందుకు ర‌కుల్ కోటీ యాభై ల‌క్ష‌ల రూపాయ‌ల పారితోషికం అందుకుంద‌ట‌. ర‌కుల్ కెరీర్‌లో ఇదే అత్యంత భారీ పారితోషికం.

Related posts