సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో మురుగదాస్ తెరకెక్కిస్తున్న చిత్రం దర్భార్. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బేనర్పై సుబస్కరన్ నిర్మిస్తున్నారు. నయనతార కథానాయిక. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. చిత్ర రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. దర్భార్ చిత్రంలో నివేథా థామస్ ఒక ముఖ్య పాత్రలో నటించింది. సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ వేడుక రీసెంట్గా జరగగా, ఈ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ ట్రాన్స్జండర్ క్యారెక్టర్ చేయలేదని, అటువంటి పాత్ర పోషించాలనుకుంటున్నానని తెలిపారు. పోలీస్ క్యారెక్టర్స్ చేయడం పెద్దగా ఇష్టం ఉండదు. అందులో చాలా సీరియస్నెస్ ఉంటుంది. క్రిమినల్స్ వెంట పరిగెత్తాలి. అందుకే ఇలాంటి పాత్రలలో చేయాలంటే ఇబ్బందిగా ఉంటుందని రజనీకాంత్ స్పష్టం చేశారు. రజనీకాంత్ తన నటనతో కంటే మంచి మనసుతోను లెక్కకి మించి అభిమానులని సంపాదించుకున్నారు. తన కెరీర్లో దాదాపు 167 సినిమాలు చేశారు. అనేక పాత్రలలో మెప్పించారు. అయితే ఎక్కువగా పోలీస్ పాత్రలే చేసిన రజనీకాంత్ మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత దర్భార్ చిత్రంలో పోలీస్గా నటించారు. ఆయన 168వ చిత్రం ఇటీవల లాంచ్ కాగా, ఈ మూవీ శివ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. కీర్తి సురేష్, ఖుష్బూ, మీనా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
next post