telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చట్టంపై గొప్పలు చెప్పడం కాదు..చిత్త శుద్ధితో అమలు చేయాలి: చంద్రబాబు

chandrababu

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం జరిగితే ఒక్క మంత్రి కూడా పరామర్శించలేదని మాజీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ అత్యాచార ఆరోపణలు ఎదుర్కుంటున్న నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలపై దిశ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

చట్టంపై గొప్పలు చెప్పడం కాదని, దానిని చిత్త శుద్ధితో అమలు చేయాలని అన్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీల అత్యాచార ఆరోపణలపై చంద్రబాబు ప్రసంగిస్తుండగా స్పీకర్ జోక్యం చేసుకుని మైక్ కట్ చేశారు. మరోవైపు ఈ అంశంపై హోంమంత్రి సుచరిత సమాధానమిస్తూ అత్యాచార నిందితులను అరెస్ట్‌ చేశామని, అట్రాసిటి కేసు నమోదు చేశామని తెలిపారు. బాలిక కుటుంబానికి పరిహారం అందజేశామని హోంమంత్రి చెప్పారు.

Related posts