telugu navyamedia
రాజకీయ వార్తలు

రాహుల్ గాంధీకి ముంబై కోర్టు బెయిల్

rahul gandhi to ap on 31st

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ పరువునష్టం కేసులో ఈ రోజు ముంబై కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో రాహుల్ గాంధీకి రూ. 15,000 పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య గురించి గతంలో రాహుల్ మాట్లాడుతూ, బీజేపీ, ఆరెస్సెస్ సిద్ధాంతాలే హత్యకు కారణమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాహుల్ పై ఓ ఆరెస్సెస్ కార్యకర్త పరువునష్టం దావా వేశారు.

బెయిల్ లభించిన అనంతరం రాహుల్ కోర్టు హాలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనపై దాడి జరుగుతోందని… అయితే, ఈ పోరాటాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పారు. తనది సిద్ధాంతాలతో కూడిన పోరాటమని చెప్పారు. పేదలు, రైతులకు అండగా తాను ఉంటానని తెలిపారు. గత ఐదేళ్లలో తాను చేసిన పోరాటం కంటే ఇకపై 10 రెట్లు ఎక్కువగా పోరాడుతానని పేర్కొన్నారు.

Related posts