టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కు విస్తృత ప్రజాదరణ లభిస్తోంది. ప్రముఖులు ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొంటున్నారు. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను బ్యాడ్మింటన్ క్రీడాకాణీ పీవీ సింధు స్వీకరించారు. పుల్లెల గోపిచంద్ నేషనల్ అకాడమీలో మూడు మొక్కలు నాటారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించాలని విరాట్ కోహ్లి, సానియా మిర్జా, నటుడు అక్షయ్కుమార్లను నామినేట్ చేసినట్లు ట్విట్ చేశారు. ఈ ఛాలెంజ్ను ప్రారంభించిన ఎంపీ సంతోష్కుమార్కు సింధు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.