తనను ఎవరేమన్నా భరిస్తాను కానీ, సీఎం జగన్ ని విమర్శిస్తే మాత్రం ఊరుకోనని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. జగన్ ని విమర్శించే వ్యక్తి ఎంత పెద్దవాడైనా సరే సహించనని అన్నారు. తనను ‘రౌడీ’ అని విమర్శిస్తుంటారని, అలాంటి వ్యక్తిని కాదన్నారు.
తమ అధినేత జగన్, నెల్లూరు జిల్లా ప్రజలు తనను మంచిగా అనుకుంటే చాలని, ఎవరేమనుకున్నా తనకు ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. తాను ఎలాంటి వాడినో నెల్లూరు ప్రజలకు, తమ కార్యకర్తలకు తెలుసని అన్నారు. అసెంబ్లీలో లేదా ఇంకెక్కడైనా మాట్లాడినప్పుడు కొంచెం దూకుడుగా ఉంటానని పేర్కొన్నారు.