డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మిల మధ్య లివింగ్ రిలేషన్ షిప్ లో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై వారిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. అయితే తాజాగా ఛార్మితో రిలేషన్పై పూరీ క్లారిటీ ఇచ్చారు.
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మూవీ ‘లైగర్’. అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుంది. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన లైగర్ ట్రైలర్, పాటలు ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలను పెంచాయి.
ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. తాజాగా టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరీ మాట్లాడుతూ..”ఆమె 50ఏళ్ల మహిళ అయితే, ప్రజలు ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోరు. ఆమె ఊబకాయంతో ఉన్నా.. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నా, ఎవరికీ ఎలాంటి చింతా ఉండదు.
కానీ, ఆమె (ఛార్మి) యంగ్ ఏజ్లో ఉంది కాబట్టి, ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని జనమంతా అనుకుంటున్నారు. ప్రతి జంటకూ ఓ రొమాంటిక్ యాంగిల్, శృంగార ఆకర్షణ ఉంటుందని నేను నమ్ముతా. అయితే, అది చాలా త్వరగా చచ్చిపోతుంది. మనందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఆ వాంఛలనేవి కొన్ని రోజులకు పోతాయని అందరికీ తెలుసు. కేవలం స్నేహం మాత్రమే కలకాలం ఉంటుందని అన్నారు.
ఈ అమ్మాయి(ఛార్మి) 13ఏళ్ల వయసు నుంచి నాకు తెలుసు. అంటే రెండు దశాబ్దాలుగా ఆమె గురించి తెలుసు. ఆమె ఎలా కష్టపడి పనిచేస్తుందో తెలుసు” అంటూ ఛార్మితో తనకున్న రిలేషన్ గురించి పూరీ జగన్నాథ్ ఆసక్తికరంగా చెప్పకొచ్చారు.