దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో “ఆర్ఆర్ఆర్” అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తైందని ఇటీవల మేకర్స్ తెలిపారు. అయితే చిత్రంలో చరణ్ సరసన కథానాయికగా అలియా భట్, ఎన్టీఆర్కి జోడీగా ఓలివియా మోరిస్పై సనటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చితాన్ని వచ్చే ఏడాది 2021, జనవరి 8న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే కరోనా నేపథ్యంలో మూవీ షూటింగ్లకు బ్రేక్ పడగా.. ఆర్ఆర్ఆర్ కూడా చిత్రీకరణను ఆపేసింది. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే.. పుణె షెడ్యూల్లో అలియా పాల్గొనాల్సి ఉంది. దానికి సంబంధించిన డేట్లను కూడా ఆమె ఇచ్చేసింది. కానీ ఇప్పుడు షూటింగ్కు బ్రేక్ పడిన నేపథ్యంలో ఆమె మళ్లీ డేట్లు అడ్జెస్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే బాలీవుడ్లో ఆమె చేతినిండా సినిమాలు ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ కోసం డేట్లు అడ్జెస్ట్ చేయడం కాస్త కష్టమైన పనే. ఒకవేళ తప్పుకుంటే ఆర్ఆర్ఆర్కు మరోసారి హీరోయిన్ సమస్య ఎదురవుతోంది. ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ జోడీగా మొదట హాలీవుడ్ బ్యూటీ డైజీ ఎడ్గర్ జోన్స్ను అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. కానీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకోవడంతో.. ఆ తరువాత మరో హీరోయిన్ను ఎంపిక చేయడానికి ఆర్ఆర్ఆర్ టీమ్కు చాలా రోజులే పట్టింది. ఇక ఇప్పుడు అలియా విషయంలో అదే జరిగితే.. ఈ సారి భారీ షాక్ తప్పదు. ఎందుకంటే షూటింగ్లో జాప్యం వల్లన ఇప్పటికే ఆరు నెలలకు ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రాజమౌళి, అలియాతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఆర్ఆర్ఆర్ కోసం డేట్లను అడ్జెస్ట్ చేసుకోవాలని ఆమెకు సూచించారట. దీనిపై అలియా కూడా సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
previous post