దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ప్రజా రవాణ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కొద్దిపాటి నియంత్రణలతో ప్రజా రవాణాకు త్వరలో అనుమతిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రహదారులు హైవే మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తోన్న గడ్కరీ పేర్కొన్నారు. భారత బస్, కార్ ఆపరేటర్ల సమాఖ్య ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఈ మేరకు వెల్లడించారు.
బస్సులు, కార్లు నడిపే క్రమంలో ప్రజలు తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, ఫేస్ మాస్క్లు ధరించడం వంటి భద్రతా చర్యలు చేపట్టాలని, భౌతిక దూరం పాటించాలని గడ్కరీ సూచించారు. అయితే ప్రజా రవాణాను ఎప్పటి నుంచి అనుమతిస్తారనేది మంత్రి వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు మే 17 వరకూ లాక్డౌన్ కొనసాగనుంది.
రాజధాని విషయంలో తమది ఎప్పుడూ ఒకే మాట: లోకేశ్