కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ లకు కరోనా కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు కేంద్ర మంత్రులకు వైరస్ సోకింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ కరోనా బారినపడ్డారు. ఆయనతో పాటు వ్యవసాయ శాఖ సహాయమంత్రి కైలాశ్ చౌదరికి కూడా కరోనా నిర్దారణ అయింది.
ప్రస్తుతం అర్జున్ రామ్ మేఘ్ వాల్ ట్రామా సెంటర్ ఆఫ్ ఎయిమ్స్ లో చేర్చగా, కైలాశ్ చౌదరి జైపూర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేఘ్ వాల్ కు తేలికపాటి ఇన్ ఫెక్షన్ మాత్రమే ఉందని తెలుస్తోంది.