telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ప్రియాంక హత్య కేసు..షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు మేజిస్ట్రేట్!

ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులను షాద్‌నగర్ పోలీసు స్టేషన్‌లో విచారిస్తున్నారు. మరికాసేపట్లో షాద్‌నగర్ కోర్టులో ప్రవేశపెట్టనున్న సమయంలో పోలీసు స్టేషన్ ఎదుట స్థానికులు ఆందోళనకు దిగారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

పరిస్థితులు ఉద్రిక్తభరితంగా మారడంతో నిందితులను పీఎస్ నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశం లేకపోయింది. ఈ నేపథ్యంలో, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (తహశీల్దార్) పాండునాయక్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ముందు నిందితులను పోలీసులు ప్రవేశపెట్టారు. నిందితులను రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. ప్రియాంక హత్య కేసు నిందితులకు ఎలాంటి సహాయం ఉండదని, వారి తరపున వాదించమని షాద్‌నగర్ బార్ అసోసియేషన్ ప్రకటించింది.

Related posts