ఒక్కపాటతో ఓవర్నైట్ సెలబ్రిటీగా మారిన సింగర్ రణుమొండల్. లతా మంగేష్కర్ పాడిన ఏక్ ప్యార్ కా నాగ్మా హై అనే పాటతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. రీసెంట్గా రణు ఓ మాల్ ఓపెనింగ్కి హాజరు కాగా, ఆ సమయంలో ఓవర్ డోస్ మేకప్ వేసుకుందని విమర్శలు తలెత్తాయి. దీనిపై కూడా రణు ఇప్పటి వరకు స్పందిచకపోగా, మేకప్ ఆర్టిస్ట్ సంధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఫోటో ఫేక్ అని తేల్చేసింది. అయితే ఇటీవల ఓ అభిమాని తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించగా, కాస్త దురుసుగా ప్రవర్తించి వార్తలలోకి ఎక్కింది. ఆ సంఘటనకి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, నెటిజన్స్ ఆమె ప్రవర్తనని తప్పుపట్టారు. ఇలాంటి పలు కారణాలతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై ఆమె కుమార్తె ఎలిజబెత్ సాథీ స్పందించారు. ‘మా అమ్మపై ఇటువంటి విమర్శలు వస్తున్నందుకు ఎంతో బాధగా ఉంది. మా అమ్మ తన జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొంది. ఇప్పుడు ఆమె జీవితంలో విజయం లభించింది. అయితే ఇటువంటి సందర్భంలో చాలామంది ఆమెను విమర్శిస్తున్నారు. అయితే తన తల్లి ఎంతగా విమర్శలకు గురవుతున్నా, ఆమె పాటలు ఆదరణ పొందుతుండటం ఆనందంగా’ ఉందన్నారు.