హీరోయిన్ ప్రణీత సుభాష్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా తన బేబీ గర్ల్ ని పొత్తిళ్లలోకి తీసుకుని తల్లితనాన్ని అనుభవిస్తూ దిగిన ఫోటోని అభిమానులతో పంచుకుంది ప్రణీత. ఇందులో ఆమె భావోద్వేగభరిత్తమైన, గర్వంతో కూడిన నోట్ని షేర్ చేసింది.
‘పాప పుట్టినప్పటి నుంచి అంతా కలగా అనిపిస్తోంది. నాకు గైనకాలజిస్ట్ అయిన తల్లి ఉండటంం నిజంగా నా అదృష్టం.. కానీ మానసికంగా మాత్రం ఆమెకు ఇది చాలా కష్ట సమయం.
డాక్టర్ సునీల్ ఈశ్వర్, అతడి టీమ్ డెలివరీ సవ్యంగా జరిగేలా చూశారు. అలాగే డాక్టర్ సుబ్బు, అతడి బృందానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విషయం మీకు చెప్పకుండా ఉండలేకపోయాను` అంటూ వైద్యులతో దిగిన పలు ఫొటోలు షేర్ చేసింది. కానీ ఇందులో పాప ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంది.
ప్రణీత గతేడాది మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లాడింది. పెళ్లి సింపుల్గా చేసుకుని, ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తల్లి కాబోతున్న విషయాన్ని సైతం సోషల్ మీడియా ద్వారానే ప్రకటించింది. స్కానింగ్ కాపీని షేర్ చేసి గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. ఇటీవలే ప్రణీత బేబీ బంప్తో పాటు సీమంతం ఫొటోలను సైతం అభిమానులతో పంచుకుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారింది. దీంతో ప్రణీతకి అభిమానులు, సెలబ్రిటీలు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
శ్రీదేవి చేసిన సినిమాల్లో ఐదో భాగం కూడా నేను చేయలేదు : మాధురీ దీక్షిత్