telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీకాంత్ ని పరామర్శించిన చిరంజీవి

Chiru

శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు చనిపోయారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న పరమేశ్వరరావు నిన్న రాత్రి 11 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. శ్రీకాంత్‌కు చిరంజీవితో మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ తండ్రి చనిపోయారని తెలీగానే హుటాహుటిన చిరు ఆయన ఇంటికి చేరుకున్నారు. పరమేశ్వరరావు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. శ్రీకాంత్‌ను, ఆయన కుటుంబీకులను పరామర్శించారు. చిరంజీవితో పాటు పక్కనే ప్రముఖ నటుడు గోపీచంద్ కూడా ఉన్నారు.పలువురు సినీ ప్రముఖులు శ్రీకాంత్ ఇంటికి వచ్చి సంతాపం తెలియజేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో ఆయన పార్ధీవదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.పరమేశ్వరరావు 1948 మార్చి 16న కృష్ణాజిల్లా మేకావారిపాలెంలో జన్మించారు. అనంతరం వీరి కుటుంబం కర్ణాటకలోని గంగావతికి వలస వెళ్లింది. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు. శ్రీకాంత్ కూడా గంగావతిలోనే జన్మించాడు.ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్‌కౌంటర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీకాంత్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించి నెమ్మదిగా హీరోగా మారారు. సురేశ్ ప్రొడక్షన్‌‌లో వచ్చిన తాజ్‌మహల్ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లిసందడి శ్రీకాంత్ కెరీర్‌ను మలుపు తిప్పాయి.

Related posts