telugu navyamedia
తెలంగాణ వార్తలు

జూబ్లీహీల్స్ బాలిక రేప్ కేసు : మెడిక‌ల్ రిపోర్ట్‌లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జూబ్లీహీల్స్ బాలిక కేసు ఏ-1 నిందితుడు రెండో రోజు క‌స్ట‌డీకి తీసుకుని విచారించారు. ప‌బ్‌లో ఏం జ‌రిగింద‌న్న వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. అమ్మాయిని ట్రాప్ చేయ‌డం ఆ త‌రువాత రేప్ చేయ‌డం ప‌థ‌కంలో భాగ‌మేనా అన్న ప్ర‌శ్న‌లు వేశారు.

ఇవాళ జూబ్లీహీల్స్ పీఎస్‌లో మూడో రోజు కూడా విచారించ‌నున్నారు. మైన‌ర్ల‌తో క‌లిపి, వేర్వేరుగా సాదుద్దీన్‌ను విచారించ‌నున్న‌ట్లు పోలీసులు తెలిపారు. విచార‌ణ అనంత‌రం మైన‌ర్ల‌ను జువైన‌ల్ హోం కు త‌ర‌లిస్తారు.

Thumbnail image

మ‌రోవైపు రేప్‌కేసులో జువెనైల్ హోమ్‌లో మైన‌ర్లను మొద‌టి రోజు విచారించారు. బాలికను బెంజ్ కారు నుంచి ఇన్నోవాలోకి ఎందుకు మార్చారు? అత్యాచారం చేసిన తర్వాత అరెస్టు వరకు మూడ్రోజులు ఎక్కడ ఉన్నారు..? వారు తప్పించుకునేందుకు సహకరించిందెవరు? అనే వివరాలు రాబట్టే దిశగా విచారణ సాగినట్టు సమాచారం. 

బాలిక రేప్ కేసు మెడిక‌ల్ రిపోర్ట్‌లో సంచ‌ల‌న విష‌యాలు

బాలిక మెడచుట్టూ పంటిగాట్లు.. జూబ్లీహిల్స్‌లో సామూహిక అత్యాచారానికి పాల్పడిన బాలిక వైద్య నివేదిక పోలీసులకు అందినట్లు తెలుస్తోంది. బాలిక మెడ చుట్టూ దాదాపు ఏడెనిమిదిచోట్ల పంటితో కొరికిన గుర్తులతోపాటు చుట్టూ గోళ్లతో రక్కిన ఆనవాళ్లు ఉన్నట్లు నివేదికలో స్పష్టమైంది. దీంతోపాటు శరీరంపై చాలా ప్రాంతాల్లో గోళ్లతో రక్కిన గాయాలున్నాయని నివేదికలో వైద్యులు తేల్చినట్టు సమాచారం.

లైంగిక దాడికి పాల్పడే క్రమంలో బాలిక ప్రతిఘటించడంతో వారు ఇలా దారుణంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇన్నోవా వాహనంలో అత్యాచారం చేసిన సమయంలో ఉన్న ఆధారాలు కొన్నింటిని ఫోరెన్సిక్‌ బృందం స్వాధీనం చేసుకుంది. ఆయా ఆధారాలకు సంబంధించిన నివేదికలు ఇంకా రావాల్సిఉంది.

మరోవైపు కస్టడీలో ఉన్న ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌ విచారణలో ఆశించిన మేరకు సమాచారం ఇవ్వకపోవడంతో మరింత లోతుగా విచారించాలని పోలీసు భావిస్తున్నారు.

 

Related posts