telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిర్మాతగా మారనున్న కొరటాల

Koratala

సోషల్ మెసేజ్‌ను కమర్షియల్ పంథాలో చెప్పి ఆ సినిమాను బ్లాక్ బస్టర్ చేయడంలో కొరటాల శివ నైపుణ్యుడు. ఇది అందరికి సాధ్యం కాదు. ఇప్పుడు కొరటాల సినిమా అంటే ఓ బ్రాండ్ అనే స్థాయికి వెళ్ళిపోయింది. అందుకే చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోలైన ఎన్టీఆర్, మహేష్, మెగాస్టార్ లాంటీ వారు కూడా ఆయనతో సినిమా చెయ్యటానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం కొర‌టాల మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అది అలా ఉంటే లాక్‌ డౌన్‌‌ కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని వాడుకుంటూ తమ భవిష్యత్ ప్రాజెక్టులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు. అందులో భాగంగా డైరెక్టర్ కొరటాల శివ నిర్మాతగా మారనున్నాడు. అంతేకాదు లాక్ డౌన్ ముగిసిన వెంటనే కొరటాల శివ నిర్మాతగా ఓ సినిమాని ప్రకటించనున్నారని తెలుస్తోంది. తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తున్న ఓ వ్యక్తికి దర్శకుడికి అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Related posts