telugu navyamedia
సినిమా వార్తలు

నయనతార వల్లే నాజీవితం నాశనమైపోయింది … ప్రభుదేవా మాజీ భార్య ఫైర్…

శింబు, ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపిన నయనతార. ప్రస్తుతం విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో ఉంది. అప్పట్లో ప్రభుదేవాతో ఈమె నడిపిన ఘాటు ప్రేమాయణంపై మీడియాలో చాలా వార్తలే వచ్చాయి. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అందుకే తన భార్య రమావత్‌కు విడాకులు కూడా ఇచ్చాడు ప్రభుదేవా. కానీ చివరి నిమిషంలో ఇద్దరూ విడిపోయారు. కానీ ఆయన భార్య రమాలత్ మాత్రం ఇప్పటికీ నయనతారపై చిందులు తొక్కుతూనే ఉందని తెలుస్తుంది. ఇప్పుడు కూడా నయనతారను విమర్శిస్తుంది ఈమె. తన కాపురం ఆమె వల్లే నాశనం అయిందని సన్నిహితులతో చెప్పుకుని ఏడుస్తుందని తెలుస్తుంది. ప్రభుదేవా, రమాలత్‌ది ప్రేమ వివాహం.. 1995లో వారిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. రమలాత్ ముస్లిం అమ్మాయి అయినా కూడా ప్రభుదేవా కోసం మతం కూడా మార్చుకుంది.. ఆ తర్వాత ఇద్దరూ 15 ఏళ్ల పాటు హాయిగా ఉన్నారు.

ఈ క్రమంలోనే వాళ్ల దాంపత్య జీవితంలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రభుదేవా జీవితంలోకి నయనతార వచ్చిన తర్వాత భార్యతో గొడవలు మొదలయ్యాయి. అప్పుడే ప్రభుదేవా కుమారుడు క్యాన్సర్ వ్యాధితో 2008లో చనిపోయాడు. ఆ తర్వాత గొడవలు తారాస్థాయికి చేరిపోయాయి. నయనతార కోసమే 2011లో తన భార్య రమాలత్‌కు విడాకులు కూడా ఇచ్చాడు ప్రభుదేవా. దానికోసం ఆమెకు భారీగా భరణం కూడా ఇచ్చాడని అప్పట్లో భారీగానే ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత నయన్‌ను కూడా వదిలేసాడు ప్రభు. ఇది జరిగి చాలా ఏళ్ళవుతున్నా కూడా నయనతార వల్లే తన జీవితం అంతా నాశనమైపోయిందని తన బతుకు రోడ్డున పడిందని రమాలత్ మండి పడుతుంది. తన భర్తను తనకు కాకుండా చేసిన నయనతారను దేవుడు శిక్షిస్తాడని. తనంటే ప్రాణమిచ్చే భర్తను తనకు కాకుండా చేసిన నయనతార అంతకంత తన జీవితంలో అనుభవిస్తుందని శాపనార్థాలు పెడుతోంది రమాలత్.

Related posts