కరోనా వైరస్ను నియంత్రించేదుకు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు లాక్డౌన్ ను అమలు చేస్తున్నాయి. దీంతో ఆయా దేశాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు దేశాలు ఆంక్షలు సడలించే దిశగా ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలో లాక్డౌన్ను ఎత్తేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించింది. ఈ మేరకు ఆరు ప్రమాణాలతో ప్రకటన విడుదల చేసింది.
కరోనా కేసులను ట్రాక్ చేసేందుకు అదనపు వైద్య సదుపాయాలు సమకూర్చాలి. రోగులకు మెరుగైన చికిత్స అందించి వారికి ఐసోలేషన్ సౌకర్యం కల్పించాలి. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు నర్సింగ్ హోమ్స్ వంటి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలి. స్కూళ్లు, పని ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కొత్త నిబంధనలకు ప్రజలు అలవాటు పడే వరకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
కొన్ని దేశాలు పలు వారాల పాటు సామాజిక, ఆర్థిక ఆంక్షలు భరించాయని, మరికొన్ని దేశాలు ఆంక్షలు ఎప్పుడు ఎత్తివేయాలో పరిశీలిస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనోమ్ అన్నారు. అయితే, మానవ ఆరోగ్యం, వైరస్ స్పందనను ఆధారంగా చేసుకొని ఈ నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
ఓడిపోయిన చోట పవన్ మొహం చూపించలేదు: అంబటి