‘బాహుబలి’ సినిమా తో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్.. ఆనంతరం అదే స్థాయిలో దూసుకుపోతున్నాడు. పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్లకు సంతకం చేసి ఒక్కొక్కొ సినిమా షూటింగ్ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’ షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేరె చేశారు ‘ఆదిపురుష్’ టీమ్. వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పక్కా ప్లానింగ్తో ఎలాంటి ఆటకం రాకుండా అనుకున్న టైంకి షూట్ ఫినిష్ చేశారు ఓం రౌత్ అండ్ టీమ్. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మరో 10 నెలల పాటు జరగనుంది.
రామాయణం ఆధారంగా తీస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు. కృతిసనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా కనిపించనున్నారు. సైఫ్ అలీఖాన్.. ప్రతినాయకుడు రావణాసురుడిగా నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించగా.. టీ సిరీస్-రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
ప్రభాస్ నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమా ‘రాధేశ్యామ్’.. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రభాస్కు జంటగా అందాల భామ పూజా హెగ్డే నటిస్తుంది. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ చేస్తున్నారు. ఇది కూడా వచ్చే ఏడాదే విడుదల కానుంది.
ఆ స్టార్ హీరో సెట్లోనే నాతో చాలా దారుణంగా వ్యవహరించారు : హీరోయిన్