యంగ్ రెబల్స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమాను ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. రెబల్స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభిస్తోంది. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ తో మంచి హైప్ ను తెచ్చుకున్న ఈ చిత్రం షూటింగ్ కొంత బ్యాలన్స్ ఉంది. ఇక ఈ సినిమా మ్యూజిక్ డైరక్టర్ ఎవరన్నది ఇంతవరకు క్లారిటీ రాలేదు. అయితే అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి రాధే శ్యామ్ టీం సాహో టెక్నిషియన్ ను లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఆ చిత్రానికి అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను ఇచ్చిన జిబ్రాన్ ను ఈ చిత్రానికి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చేందుకు తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.
previous post
ఏపీ మెజారిటీ ప్రజలు రోడ్ల మీదకు వస్తే హైదరాబాద్ పరిస్థితేంటి: శివాజీ