ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటిస్తున్నారు.అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో భాగంగా.. భీమవరంలోని ఏఎస్ఆర్ నగర్లో విగ్రహ ఆవిష్కరణ బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్కరించారు. వేదికపై అందరికీ అభివాదం చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీకి విల్లు, బాణం ధరింపజేశారు.
సభా వేదిక నుంచే వర్చువల్ విధానం ద్వారా భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు.
వేదికపై ప్రధాని మోదీతో పాటు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్ సహా సినీ నటుడు చిరంజీవి తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా అల్లూరి కుటుంబ సభ్యులతో మోదీ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు.
ఈవోని మంత్రి వెనకేసుకొస్తున్నారు: దేవినేని ఉమ