దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. థర్డ్వేవ్లో కూడా సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా కరోనా బారిన పడుతున్నారు.
తాజాగా ఏపీలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మంగళవారం ఉదయం ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. తనకు తేలికపాటి లక్షణాలు కనిపించగా.. పరీక్ష చేయించుకుంటే.. కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం తాను ఇంట్లో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. వైద్యుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసినవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని చంద్రబాబు సూచించారు.
కాగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు కూడా సోమవారం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని లోకేష్ ట్విట్టర్ ద్వారా సోమవారం వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, అయితే.. ముందు జాగ్రత్త చర్యగా కొవిడ్ తగ్గిపోయే వరకు హోం ఐసోలేషన్లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు లోకేష్ తెలిపారు.
ప్రజావేదిక అక్రమ కట్టడమనడం జగన్ అవగాహనా రాహిత్యం: అనురాధ