telugu navyamedia
రాజకీయ

గుజరాత్​లో మోదీ భారీ రోడ్ షో..

యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేప‌థ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శుక్రవారం గుజరాత్‌లో మెగా రోడ్‌షో నిర్వహించారు. 

శుక్రవారం, శనివారం పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ గుజరాత్​లోని పలు కార్యక్రమాల్లో పాల్గొనన్నారు. ఈ క్ర‌మంలో మోదీ శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గాంధీనగర్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు 6 కిలోమీటర్ల మేర భారీ నిర్వ‌హించారు.

ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపేందుకు వేలాది మంది కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు, ప్రజలు జాతీయ జెండాలను పట్టుకుని ‘జై శ్రీ రామ్, భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశారు. 

Prime Miniter Narendra Modi sounded a poll bugle in Gujarat, holding a mega roadshow in the state on Friday. (Image: BJP)

అహ్మదాబాద్‌లోని ఓ స్టేడియంలో మోదీ ‘ఖేల్ మహాకుంభ్’ క్రీడా కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారు. సాయంత్రం గాంధీనగర్ జిల్లాలోని లావాడ్‌లో ఉన్న రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం యొక్క మొదటి స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగిస్తారు.

అయితే.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో బిజెపి విజయం సాధించిన తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీ  తన దృష్టిని ఇప్పుడు గుజరాత్‌లో ఎన్నికలకు వైపు మ‌ళ్లింది.

Related posts