అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. తాజాగా దేశీ ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర 17 పైసలు, డీజిల్ ధర 19 పైసలు చొప్పున పైకి కదిలాయి. దీంతో హైదరాబాద్లో సోమవారం లీటరు పెట్రోల్ ధర రూ.79.85కు చేరింది. డీజిల్ ధర రూ.73.96కు ఎగసింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 16 పైసలు పెరుగుదలతో రూ.79.40కు చేరింది. డీజిల్ ధర 18 పైసలు పెరుగుదలతో రూ.73.18కు ఎగసింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 17 పైసలు పెరుగుదలతో రూ.79.04కు చేరింది. డీజిల్ ధర 18 పైసలు పెరుగుదలతో రూ.72.84కు ఎగసింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 16 పైసలు పెరుగుదలతో రూ.75.04కు చేరింది. డీజిల్ ధర 18 పైసలు పెరుగుదలతో రూ.67.78కు ఎగసింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 16 పైసలు పెరుగుదలతో రూ.80.69కు చేరింది. డీజిల్ ధర 19 పైసలు పెరుగుదలతో రూ.71.12కు ఎగసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.15 శాతం పెరుగుదలతో 66.97 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.02 శాతం పెరుగుదలతో 61.73 డాలర్లకు ఎగసింది.
previous post
next post