telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఐదేళ్ల బాలికపై అత్యాచారం…

minor raped child in visakha

మరో అనుమానుష ఘటన జరిగింది. ఐదేళ్ల బాలికపై అత్యాచారం ఘటన సంచలనంగా మారింది… ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది..ఎందుకు ఇంతటి దారుణానికి ఒడిగట్టారు..అనే అంశం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఈ సంఘటన లో నిందితుడి ఫోటోలు అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం లో ఉండటం పై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కాకినాడ నగరంలో గోలీల పేట లో ఐదు సంవత్సరాల బాలిక ఇంట్లో నిద్రిస్తుండగా బలవంతంగా ఎత్తుకు వెళ్లి మరి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై బాలికపై దాడి కూడా జరిగింది. తీవ్ర గాయాలు రక్తస్రావంతో తెల్లవారుజామున సమయంలో బాలిక కుటుంబ సభ్యులకు కనిపించింది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం ఆసుపత్రిలో బాలిక చికిత్స పొందుతుంది …తీవ్రంగా దాడి జరగడంతో ఇప్పటికే రెండు ఆపరేషన్ నిర్వహించామని వైద్యులు చెబుతున్నారు.  ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు… బాలిక కుటుంబపరమైన అంశాలతోపాటు గోలీల పేటలో నివాసముండే కొందరు అనుమానితులను కూడా పోలీసులు దృష్టి సారించారు.. ప్రాథమికంగా కుటుంబ సభ్యులని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.  అప్పటికీ ఎటువంటి ఆధారాలు లభించలేదు.. దీంతో ఈ కేసులో కీలకమైన సాంకేతిక ఆధారాలను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.. బాలిక ఒంటిపై లభించిన దాడికి సంబంధించిన గాయాలు రక్త పరీక్షలకు సంబంధించి నమూనాలు సేకరించి అనుమానితులను అదుపులోకి తీసుకున్న తర్వాత వారికి కూడా రక్త పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ప్రయత్నిస్తున్నారు.

Related posts