ఇటీవల ప్రపంచకప్లో భాగంగా పాక్-భారత్ తలపడటం, అందులో భారత్ విజయం సొంతం చేసుకోవడం తెలిసిందే. అయితే పాక్ ఓటమిని జీర్ణించుకోలేని ఆ దేశ అభిమానులు పాక్ జట్టును నిషేధించాలంటూ కోర్టు మెట్లెక్కారు. భారత్తో మ్యాచ్ ఓడిపోయినందుకుగాను పాక్ జట్టును నిషేధించాలని, ఆ జట్టుతో పాటు సెలక్షన్ కమిటీ కూడా బాధ్యత వహించాలంటూ పంజాబ్ ప్రావిన్స్లోని గుజ్రన్వాలా సివిల్ కోర్టులో ఓ అభిమాని పిటిషన్ దాఖలు చేశాడు.
జట్టు సహా, ఇంజమామ్ ఉల్ హక్ అధ్యక్షతన ఉన్న సెలక్షన్ కమిటీపై నిషేధం విధించాలని పిటిషన్లో పేర్కొన్నాడు. సివిల్ కోర్టు న్యాయమూర్తి ఈ పిటిషన్ను విచారించి దీనిపై నివేదికలు అందించాల్సిందిగా పాక్ క్రికెట్ బోర్డు(పిసిబి)కు ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశమై బుధవారం పిసిబి సమావేశం కానుంది. జట్టు మేనేజ్మెంటులో భారీ మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది.