తొలి సినిమా “ఆర్ఎక్స్ 100″తోనే తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ఉత్తరాది భామ పాయల్ రాజ్పుత్. దర్శకుడు అజయ్ భూపతి రూపొందించిన “ఆర్ఎక్స్100” సినిమాలో పాయల్ అత్యంత బోల్డ్గా నటించి యూత్ కు కట్టిపడేసింది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బోల్డ్ బ్యూటీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
“నిజం చెప్పాలంటే నటిగా నేను గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటాను. అయితే కొత్త తరహా పాత్రలు వస్తే వదులుకోను. `ఆర్ఎక్స్100` సినిమా కథను చాలా మంది హీరోయిన్లకు వినిపించారట. వారెవరూ ఆ సినిమా చేసేందుకు అంగీకరించలేదట. ఆ కథ విన్నప్పుడు నేను షాకవలేదు. ఎందుకంటే అలాంటివి ప్రస్తుతం సమాజంలోనూ జరుగుతున్నాయి. నేను చేయబోయే సినిమాలో నా పాత్ర చాలా బోల్డ్గా ఉంటుందని ఇంట్లో చెప్పాను. అమ్మానాన్నా మొదట అభ్యంతర పెట్టినా తర్వాత అంగీకరించారు. అయితే సినిమా చూసిన తర్వాత మాత్రం ఇద్దరూ షాకయ్యారు” అని పాయల్ చెప్పుకొచ్చింది.
ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వర్ రావు (1970 – 80 కాలానికి చెందిన వ్యక్తి) జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో పాయల్ ఒక పాత్రలో నటిస్తోంది. దొంగాట – కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వంశీ కృష్ణ ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నాడు. నిది అగర్వాల్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ బయోపిక్ లో వేశ్య పాత్ర కోసం చాలా మందిని పాయల్ రాజ్ పుత్ ని సెలెక్ట్ చేసుకున్నారు.