telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సైరా : చిరంజీవికి కేటీఆర్ షాక్

Syeraa

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 20న విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ సినిమా నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను భారీగా నిర్వహించబోతున్నారు. సెప్టెంబర్ 18న జరగనున్న ఈ వేడుకకు హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియం ముస్తాబవుతోంది. ఈ వేడుకకు తెలంగాణ మంత్రి, రామ్ చరణ్ స్నేహితుడు కేటీఆర్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకధీర ఎస్. ఎస్. రాజమౌళి, సక్సెస్‌పుల్ డైరెక్టర్ కొరటాల శివ, మాస్ డైరెక్టర్ వివి వినాయక్‌.. అతిథులుగా రాబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. కానీ ఈ ప్రకటన చేసిన కాసేపటికే ట్విటర్ వేదికగా మరో ప్రకటన చేశారు. సైరా ప్రిరిలీజ్ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి హాజరుకావడం లేదని వెల్లడించారు. ప్రభుత్వ అధికార కార్యక్రమాలకు వెళ్లాల్సిన నేపథ్యంలో ఆయన రావడం లేదని తెలిపారు. దీంతో ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Related posts