తెలంగాణలోని పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని యశోదా ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యం విషమించడంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందారు. మంగళవారం వరంగల్లోని పద్మాక్షి శ్మశానంలో శ్రీనివాసరావు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం శాసనసభ్యులుగా పనిచేశారు. దుగ్యాల మృతిపై పలువురు సంతాపం ప్రకటించారు.
previous post


జర్నలిజం మౌలిక స్వరూపం దెబ్బతింది: ఉప రాష్ట్రపతి వెంకయ్య