telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కొలిక్కి వచ్చిన బ్రహ్మంగారి మఠాధిపతి వ్యవహారం…

ఏపీలో గత కొన్ని రోజులుగా చర్చాంశనీయంగా మారిన బ్రహ్మంగారిమఠం మఠాధిపతి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. బ్రహ్మంగారిమఠం మఠాధిపతి ఎంపిక పూర్తి అయ్యింది. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సారథ్యంలో కందిమల్లయ్యపల్లి సంస్థానం పుర ప్రజల సహకారంతో మఠాధిపతి ఎంపిక దాదాపు పూర్తి అయ్యింది. పీఠాధిపతి ఎంపికపై ఏకాభిప్రాయంకు వచ్చారు కుటుంబ సభ్యులు. దివంగత పీఠాధిపతి మొదటి భార్య మొదటి కుమారుడు వెంకటాద్రి స్వామిని మఠాధిపతిగా ఎంపికకు సయోధ్య కుదిరింది. బ్రహ్మంగారిమఠం ఉత్తరాధికారిగా మొదటి భార్య రెండవ కుమారుడు వీరభద్రయ్యను నియమించారు. వీరిరువురి తదనంతరం మఠాధిపతిగా మారుతీ మహాలక్ష్మమ్మ కుమారుడికి అవకాశం రానుంది. దాంతో ఇరు కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థుల భేటి సఫలం అయ్యింది.

Related posts