పలు అంతర్జాతీయ సంస్థలు నెలకొని ఉన్న సెంట్రల్ కాబుల్లోని గ్రీన్ విలేజ్ సమీప ప్రాంతంలో ఆత్మాహుతి దాడి జరిగింది. కారులో వచ్చిన దుండగుడు కారుతో సహా తనను తాను పేల్చుకోవడంతో ఐదుగురు మృతి చెందగా, 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నామని దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి నస్రత్ రహిమి తెలిపారు.
గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ ఘటనకు తామే బాధ్యత వహిస్తున్నట్లు తాలిబన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.
చంద్రబాబు సేవలు దేశానికి అవసరం: కనకమేడల