బ్రెజిల్లో ఓ వేదికపై ప్రసంగిస్తున్న మత గురువును లావుగా ఉన్న ఓ మహిళ అమాంతం కిందికి నెట్టేసింది. ఆయన బోధనలు వింటున్న 50 వేలమందికిపైగా ఉన్న ప్రజలు ఈ ఘటనతో ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. మత గురువును ఆమె ఎందుకలా తోసిందంటే.. ఆయన తన బోధనల్లో లావుగా ఉన్న మహిళలు స్వర్గానికి వెళ్లరని చెప్పాడట.
ఆ మాటలతో కోపంతో ఊగిపోయిన ఆ మహిళ వేదికపైకి వచ్చిన మహిళ వెనకి నుంచి వచ్చి అమాంతం కిందికి తోసేసింది. నిందితురాలైన మహిళ మానసిక ఆరోగ్యం దెబ్బతిందని ఆమె స్నేహితులు పేర్కొన్నారు. ఘటన తర్వాత పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నప్పటికీ బాధిత మత గురువు ఫిర్యాదు చేయకపోవడంతో ఆమెను విడిచిపెట్టారు.