నవరాత్రుల నుంచి ఢిల్లీ నుంచి కత్రా వెళ్లే సెమీ హైస్పీడ్ ట్రైన్ ‘వందేభారత్’ ప్రారంభం కానుంది. ఈ ట్రైన్కు సంబంధించిన ట్రయిల్ ఇప్పటికే పూర్తయ్యింది. క్లియరెన్స్ కూడా లభ్యమైంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా సిద్ధమైంది. ఈ ట్రైన్ ఉదయం 6 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 2 గంటలకు కత్రా చేరుకుంటుంది. ఈ ట్రైన్లో ప్రధానంగా వైష్ణోదేవి యాత్రకు వెళ్లేవారు ప్రయాణిస్తారు. అందుకే మెనూలో నాన్వెజ్ లభ్యంకాదు.
ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం వందేభారత్ ట్రైన్ మరింత సౌకర్యవంతంగా ఉండనుంది. త్వరలోనే ఈ రైలుకు సంబంధించిన టిక్కెట్టు ధరలు ఖరారు కానున్నాయి. అలాగే ఈ ట్రైన్ ప్రయాణ వివరాలను ప్రకటించనున్నారు.
రనూమండల్ పై హిమేష్ రేష్మియా ఘాటు వ్యాఖ్యలు