telugu navyamedia
రాజకీయ వార్తలు

భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం: నిర్మలా సీతారామన్

Nirmala seetharaman

భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వాషింగ్టన్ లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు నిర్వహించిన ఓ సమావేశంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమెరికా, భారత్ మధ్య వాణిజ్య సంబంధ విభేదాలు చాలా స్వల్పంగానే ఉన్నాయని అన్నారు. కొన్ని అంశాల్లో ఉన్న విభేదాలు తొలగిపోతయనిత్వరలోనే ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నానని తెలిపారు.

బాదం, యాపిల్స్ సహా 28 అమెరికా ఉత్పత్తులపై కొన్ని నెలల క్రితం భారత్ సుంకాలు పెంచింది. ఈ నేపథ్యంలో భారత్ కు వాణిజ్య రంగంలో ఇస్తున్న ప్రత్యేక పన్ను రాయితీలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది జూన్ లో రద్దు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై స్వల్ప విభేదాలు తలెత్తాయి.

Related posts