స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించింది. ఈ మేరకు సవరించిన వడ్డీరేట్లను ప్రకటించింది. తక్కువ కాలపరిమితి డిపాజిట్లపై 50 నుంచి 75 బేసిస్ పాయింట్లు తగ్గించారు. రిటైల్ డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సవరించిన వడ్డీ రేట్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలపై వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న దరిమిలా ఎస్ బీఐ తన తాజా వడ్డీరేట్లను ప్రకటించినట్టు తెలుస్తోంది.