telugu navyamedia
వార్తలు సామాజిక

కరోనా కాటుకు పద్మశ్రీ అవార్డు గ్రహీత బలి

Nirmal singh punjob

కరోనా వైరస్ సోకి పద్మశ్రీ అవార్డు గ్రహీత, గుర్బానీ గాయకుడు నిర్మల్‌ సింగ్‌ (62) గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు బుధవారమే తేలింది. అంతలోనే ఈ తెల్లవారుజామున ఆయన మృతి చెందారు. నిర్మల్‌ సింగ్‌ ఇటీవలే విదేశాల నుంచి పంజాబ్‌కు వచ్చాడు. మార్చి 30వ తేదీన ఆయనకు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి.

దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. నిన్న సాయంత్రం నిర్మల్‌ సింగ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. చికిత్స కొనసాగుతుండగానే ఇవాళ ఉదయం 4:30 గంటలకు నిర్మల్‌ సింగ్‌ మృతి చెందినట్లు పంజాబ్‌ విపత్తు నిర్వహణ ప్రత్యేక అధికారి తెలిపారు.

Related posts