telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ కేసు.. గవర్నర్ కు తెలియజేస్తాం: శ్రీకాంత్ రెడ్డి

srikanthreddy ycp

ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలంటే గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను తాము గౌరవిస్తామని చెప్పారు.నిమ్మగడ్డ రమేశ్ ను ఎస్ఈసీగా పరిగణించమని గవర్నర్ చెప్పారని, అయితే ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి, ఏం జరుగుతుందో వేచి చూడాలని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

నిమ్మగడ్డ కేసు సుప్రీంకోర్టులో ఉన్న విషయాన్ని తాము గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కోట్ల రూపాయల ఫీజు తీసుకునే లాయర్లను నిమ్మగడ్డ పెట్టుకున్నారని చెప్పారు. ఆయనకు ఈ డబ్బును ఎవరిస్తున్నారని ప్రశ్నించారు. డబ్బు చంద్రబాబు ఇస్తున్నారా? అని అన్నారు. తనకు సంబంధించిన వ్యక్తులు కీలక పదవుల్లో ఉండేలా చంద్రబాబు తెర వెనుక కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Related posts