telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

జీహెచ్ఎంసీ బ్రాంచ్ క్యాషియర్ కు కరోనా పాజిటివ్

Corona

తెలంగాణలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏకంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే కరోనా విజృంభిస్తోందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాదులోని జీహెచ్ఎంసీ కార్యాలయంలోని ఎస్ బీఐ బ్రాంచ్ క్యాషియర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

దీంతో జీహెచ్ఎంసీ ఆఫీసులో కరోనా బాధితుల సంఖ్య 32కి పెరిగింది. బ్యాంక్ క్యాషియర్ రోజూ 100 మందికి చెల్లింపులు చేసినట్టు గుర్తించారు. ఇప్పుడు వాళ్లందరి ఆరోగ్య పరిస్థితి ఏంటన్న దానిపై ఆందోళన నెలకొంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 10 వేలు దాటగా, వాటిలో సగానికి పైగా కేసులు హైదరాబాద్ పరిధిలోనే గుర్తించారు.

Related posts