telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

తెలంగాణాలో .. కాంగ్రెస్ కొత్త నీరు.. 31 మంది డీసీసీ ల నియామకం.. 

AP Congress candidates list release shortly
కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులను ప్రకటించింది. మొత్తం 31 మంది డీసీసీ అధ్యక్షుల నియామకానికి ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురువారం ఆమోద ముద్ర వేశారని పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ వెల్లడించారు. వీరితో పాటు ఇద్దరు సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షులను కూడా ఆ పార్టీ నియమించింది. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్యేల సతీమణులకు ఆయా జిల్లాల పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాకు ఎమ్మెల్యే ఆత్రం సక్కు, వికారాబాద్‌కు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, అలాగే, సంగారెడ్డి జిల్లాకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలా గౌడ్‌, భూపాలపల్లి జిల్లాకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి జ్యోతికి ఆయా జిల్లాల పార్టీ సారద్య బాధ్యతలు అప్పగించారు. అలాగే, ఖమ్మం పట్టణానికి చెందిన దీపక్‌ చౌదరిని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. 
కొత్తగా నియమితులైన జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు : ఆదిలాబాద్‌-భార్గవ్‌ దేశ్‌పాండే, మంచిర్యాల-కొక్కిరాల సురేఖ, నిర్మల్‌-రామారావు పటేల్‌ పవార్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌-ఆత్రం సక్కు, కరీంనగర్‌-కె.మృత్యుంజయం, జగిత్యాల-లక్ష్మణ్‌కుమార్‌, పెద్దపల్లి-ఈర్ల కొమురయ్య, రాజన్న సిరిసిల్లా-ఎన్‌.సత్యనారాయణగౌడ్‌, నిజామాబాద్‌-మనాల మోహన్‌రెడ్డి, నిజామాబాద్‌ (అర్బన్‌)-కేశ వేణు, కామారెడ్డి-కైలాస్‌ శ్రీనివాసరావు, వరంగల్‌ అర్బన్‌/రూరల్‌-నాయిని రాజేందర్‌రెడ్డి, వరంగల్‌ నగర కాంగ్రెస్‌-కేదారి శ్రీనివాసరావు, జయశంకర్‌ భూపాలపల్లి-గండ్ర జ్యోతి, జనగామ-జంగా రాఘవరెడ్డి, సంగారెడ్డి-నిర్మలా గౌడ్‌, మెదక్‌-తిరుపతి రెడ్డి, సిద్దిపేట-టి.నరసారెడ్డి, వికారాబాద్‌-పి.రోహిత్‌ రెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి-కూన శ్రీశైలం గౌడ్‌, రంగారెడ్డి-చల్లా నరసింహారెడ్డి, మహబూబ్‌నగర్‌-కొత్వాల్‌ ఒబెదుల్లా, వనపర్తి-శంకర ప్రసాద్‌, జోగులాంబ గద్వాల-పటేల్‌ ప్రభాకరరెడ్డి, నాగర్‌కర్నూలు-సిహెచ్‌ వంశీకృష్ణ, సూర్యాపేట- చెవిటి వెంకన్నయాదవ్‌, యాదాద్రి భువనగిరి-బి.భిక్షమయ్యగౌడ్‌, మహబూబాబాద్‌-జె.భరత్‌ చంద్రారెడ్డి, నల్గొండ-కె.శంకర్‌నాయక్‌, భద్రాద్రి కొత్తగూడెం-వనమా వెంకటేశ్వరరావు, ఖమ్మం-పువ్వాడ దుర్గా ప్రసాద్‌లను నియమించారు. కాగా, గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షునిగా-ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌, ఖమ్మం నగర పార్టీ అధ్యక్షునిగా జావీద్‌ను నియమించారు. 
డీసీసీ అధ్యక్షుల నియామకంలో ఏఐసిసి అధిష్టానం సామాజికవర్గ సమీకరణాలకూ ప్రాధాన్యత ఇచ్చింది. కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులలో బ్రాహ్మణ-2, వెలమ-1, ఎస్టీ-2, ఎస్సీ-2, బీసీ-12, కమ్మ-2, రెడ్డి-10, ముస్లిం-2గా ప్రాధాన్యం కల్పించారు.

Related posts