telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

భాగ్యనగరంలో భానుడి భగభగ.. 40 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రత

this summer exceeds 47 degress and more

ఈ సారి ఎండ తీవ్రత రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకా రోహిణి కార్తె రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఎండ తీవ్రతకు తట్టుకోలేని ప్రజలు, ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ సీజన్ లో హైదరాబాద్ లో తొలిసారిగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

పగటి పూట ప్రధాన వీధులు బోసిపోతున్నాయి. సందర్శకులు లేక పలు పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ సంవత్సరంలో ఎండలు అధికంగా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, నిన్న నిజామాబాద్, రామగుండం, ఆదిలాబాద్ ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి ప్రాంతాల్లో 39 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Related posts