telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు మౌనీ బాబా అయ్యారు: : విజయసాయి

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో విమర్శనాస్త్రాలు సంధించారు. బీసీలను, కాపులను ఉద్దరిస్తానని చెప్పిన చంద్రబాబుకు జగన్ కేబినెట్‌ను ప్రశంసించడానికి మాటలు రావడం లేదన్నారు. బీసీలకు 50 శాతం పనులు నామినేషన్ ద్వారా కేటాయిస్తామన్నారు.

సామాజికంగా వెనకబడ్డవారికి నాలుగు డిప్యుటీ సీఎంలు ఇవ్వడంపై ఏ వ్యాఖ్యలు చేయకుండా చంద్రబాబు మౌనీ బాబా అయ్యారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రివర్గంలో 60శాతం మంది అణగారిన వర్గాల వారే ఉన్నారని, జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా బలహీనవర్గాల ప్రభుత్వమేనని విజయసాయి అన్నారు. ఆశా వర్కర్లకు 300 శాతం వేతనం పెంచి, జగన్ వారికి అండగా నిలిచారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Related posts