బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమం సక్సెస్ఫుల్గా తొమ్మిది వారాలు పూర్తి చేసుకొని పదో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. గత వారం హిమజ ఎలిమినేట్ అయ్యింది. పదో వారంలో శ్రీముఖి, రవి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్లలో ఒకరు ఇంటి నుండి బయటకి వెళ్లనున్నారు. మంగళవారం కెప్టెన్ పదవి పొందేందుకు ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చారు. అత్త రాజ్యంలో కోడళ్ళ పాట్లు అనే టాస్క్లో భాగంగా శివజ్యోతికి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు ఉంటారు. కొడుకులుగా వరుణ్, రాహుల్, రవికృష్ణ ఉండగా వారి భార్యలుగా వితికా, పునర్నవి, శ్రీముఖి ఉన్నారు. బాబా భాస్కర్ శివజ్యోతి మేనేజర్గా, మహేష్ అసిస్టెంట్గా ఉంటారని బిగ్ బిస్ తెలిపారు. టాస్క్లో భాగంగా బ్రిక్ షాప్లో ఉన్న ఇటుకలతో కొడుకు, కోడలు కలిసి గోడ కట్టవలసి ఉంటుంది.
గోడ కట్టేందుకు శివజ్యోతిని మెప్పించి, తనకు కావలసిన పనులు చేసి ఆమె దగ్గర ఉన్న ఇటుకలు తీసుకొని గోడ కట్టాల్సి ఉంటుంది. ఎవరైతే పెద్ద గోడ కడతారో వారు కెప్టెన్ టాస్క్లో ఉంటారని బిగ్ బాస్ ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ఇంటి సభ్యులు మరో అద్భుత పర్ఫార్మెన్స్ ప్రేక్షకుల ముందు పెట్టారు. కొడుకులుగా రవి, రాహుల్, వరుణ్లు కాస్త సైలెంట్గా ఉన్నప్పటికి కోడళ్ళు మాత్రం అత్త కాళ్లు మీద పడి మరి ఆమె దగ్గర మంచి మార్కులు కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ టాస్క్ బుధవారం కూడా సాగనుండగా, ఎవరు అత్త దగ్గర ఎక్కువ మెప్పు పొందుతారో చూడాలి.
ఇక మంగళవారం ఎపిసోడ్ మొదట్లో నామినేషన్ గురించి కాసేపు చర్చ జరిగింది. ముఖ్యంగా శ్రీముఖిని బాబా భాస్కర్ నామినేషన్ చేయడంపై ఆమె తెగ ఫీలైంది. దీని గురించి కొన్ని గంటల పాటు బాబా, శ్రీముఖి చర్చలు జరిపారు. ఇక పునర్నవి నామినేషన్ సమయంలో తనకి బాష రాదని చెప్పడం అస్సలు బాగోలేదని బాబా భాస్కర్ అన్నాడు. ఇక వితికా, రవిల నామినేషన్పై రాహుల్ గ్యాంగ్ చర్చలు జరుపుతున్న సమయంలో పునర్నవి నోటికి వచ్చినట్టు రవిపై విరుచుకుపడింది. ‘రవిగాడు వెధవ.. ఆ వెధవతో ఎందుకు మాట్లాడాలి.. వాడితో సొల్లు డిస్కషన్ ఎందుకు. సెన్స్ లెస్ ఆర్గ్యుమెంట్ చేసే అలాంటి వెధవతో మాట్లాడాల్సిన అవసరం లేదు. వాడి బతుకు. ఎప్పుడైనా తన ఒపీనియన్ని చెప్పాడా? వెటకారంగా నవ్వుతాడు ప్రతిదానికి. 31 ఏళ్లు ఉన్నవాడు ఇలా ప్రవర్తిస్తాడా అంటూ చెలరేగిపోయింది పునర్నవి. ఆమె మాటలపై నెటిజన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు.
ఆయన కూడా వలస వచ్చినవాడే కాబట్టి… సోనూసూద్ పై బ్రహ్మానందం కామెంట్స్