మా ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది ‘మా’ ఎలక్షన్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనుండగా.. మంచు విష్ణు, ప్రకాష రాజ్ లు అధ్యక్ష పదవి కోసం ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. ఇప్పటికే ప్రకాశ్రాజ్ తన ప్యానల్ ప్రకటించగా.. తాజాగా విష్ణు ప్యానల్ నుంచి ఓ కీలక నటుడి పేరు బయటకు వచ్చింది.
మంచు విష్ణు ప్యానెల్ నుంచి జనరల్ సెక్రెటరీగా నటుడు రఘుబాబు పోటీలో దిగుతున్నారు. అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా బాబు మోహన్ పోటీలో నిలుస్తున్నారు. అయితే ఈ పదవి గురించి ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఇప్పటికే పెద్ద రచ్చ కొనసాగుతుంది. అధ్యక్ష బరిలో ఉన్న జీవితను.. తన ప్యానల్ లో చేర్చుకుని జనరల్ సెక్రటరీ పదవి కోసం పోటీకి దిగే అవకాశమిచ్చారు ప్రకాష్ రాజ్. దీంతో అలిగిన బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి తప్పుకుని జనరల్ సెక్రటరీ పదవి కోసం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు.
ఇక ఇప్పటికే ఈ పదవి కోసం జీవిత, బండ్ల గణేష్ మధ్యలో నువ్వా నేనా అన్న రేంజిలో మాటల యుద్ధం నడుస్తుండగా.. ఇప్పుడు లేటెస్ట్ గా రఘుబాబు కూడా బరిలోకి దిగటంతో పోటీ మరింత హాట్ టాపిక్గా మారింది. ఈసారి ‘మా’ అధ్యక్ష స్థానానికి ముగ్గురు పోటీపడుతుండడంతో ఫిలింనగర్లో గెలుపు ఎవరిది అనేది ప్రజల్లో ఎంతో ఆసక్తి నెలకొంది.