గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గత ఏడాది అమెరికాకు చెందిన ప్రముఖ పాప్సింగర్ నిక్ జొనాస్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగి… హాలీవుడ్లోనూ క్వాంటికో సిరీస్లో ప్రతిభ చాటి తనేంటో ప్రపంచానికి తెలియజేసింది. ప్రియాంక చోప్రా దాదాపు మూడేళ్ళ తర్వాత హిందీలో “ది స్కై ఈజ్ పింక్” అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా మరోమారు ప్రియాంకపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతోంది. ప్రియాంక చోప్రా తన తర్వాతి ప్రాజెక్ట్ షూటింగ్ కోసం దిల్లీ వెళ్లింది. అక్కడి కాలుష్యం భరించలేక ఎయిర్ ప్యూరిఫైయర్ మాస్క్ వేసుకుని సెల్ఫీ దిగింది. ఈ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ… “షూటింగ్ కోసం దిల్లీ వచ్చాను. ఇక్కడ షూటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఎలా జీవిస్తున్నారో ఊహించడం కూడా కష్టంగానే ఉంది. మనకు ఎయిర్ ప్యూరిఫైయర్స్, మాస్క్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఇళ్లు లేనివారిని ఆ దేవుడే కాపాడాలి” అని క్యాప్షన్ పెట్టారు. ప్రియాంక పోస్ట్పై ట్రోలింగ్ మొదలైంది. ఎందుకంటే ప్రియాంకకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉందని ఆమె ఓ సందర్భంలో చెప్పింది. అయితే బీచ్లో తన భర్త నిక్ జొనాస్తో కలిసి సిగరెట్ తాగుతూ కనిపించింది. దాంతో ‘ఇప్పుడు ఈ ఆస్తమా డ్రామా ఏమైంది?’ అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. ఇప్పుడేమో దిల్లీలో కాలుష్యం ఉందంటూ ఫొటో పెట్టడంతో మళ్లీ ట్రోలింగ్ మొదలైంది. ఇప్పుడు ఆమె ‘ది వైట్ టైగర్’ సినిమాలో నటిస్తోంది. రామిన్ బహ్రానీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజ్ కుమార్రావు హీరోగా నటిస్తున్నాడు. ఓ చిన్న గ్రామంలో టీ షాప్ వర్కర్గా పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత పెద్ద నగరంలో సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా ఎలా మారాడు అన్నదే ఈ సినిమా కథ. దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. సాధారణంగా ఊపిరి పీల్చుకోకపోతే చనిపోతాం. కానీ దిల్లీ కాలుష్యానికి అక్కడున్నవారు ఊపిరి పీల్చుకుంటే చనిపోయే పరిస్థితి ఏర్పడింది. దాంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. షూటింగ్స్ కోసం వెళుతున్న సెలబ్రిటీలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
previous post