తెలుగు రాష్ట్రాలకు వివిధ విభాగాల్లో జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. ఏపీ నీటి వనరుల విభాగానికి మూడు అవార్డులు రాగా, సూక్ష్మ సేద్యం, హార్టికల్చర్ విభాగానికి అవార్డు దక్కింది. తెలంగాణ మిషన్ భగీరథకు ప్రథమ అవార్డు లభించింది. అదేవిధంగా తెలంగాణ వాటర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్కు ద్వితీయ అవార్డు లభించింది.
రాష్ట్ర భూగర్భ జలాల విభాగానికి తృతీయ అవార్డు లభించింది. నేడు విజ్ఞాన్ భవన్లో జరిగిన నీటి పథకం జాతీయ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్, సహాయ మంత్రి రతన్ లాల్ ఈ అవార్డులను అందజేశారు.