telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అచ్చెన్న ఇంటికి లోకేశ్.. అండగా ఉన్నామని భరోసా!

Nara Lokesh

ఈఎస్ఐ కుంభకోణం కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అనారోగ్యం నేపథ్యంలో గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆసుపత్రిలోనే సీఐడీ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. మరోవైపు, ఆసుపత్రిలో ఉన్న ఆయనను కలిసేందుకు ఎవరినీ అనుమతించడం లేదు.

ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు నివాసానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెళ్లారు. అచ్చెన్న భార్య మాధవి, కుమారులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, తామంతా అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. దీంతోపాటు పార్టీ నేతలతో మాట్లాడి అచ్చెన్నను పోలీసులు అరెస్ట్ చేసిన తీరును అడిగి తెలుసుకున్నారు.

Related posts