telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీలో విజృంభిస్తున్న కరోనా…ఒక్కరోజే 10 మంది మృతి

Corona

ఏపీలో కరోనా వైరస్ దూసుకుపోతోంది. దీంతో అక్కడ రోజురోజుకూ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 605 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 34 మంది కాగా, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరికి పాజిటివ్ అని తేలింది.

ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,489కి చేరింది. తాజాగా, 191 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు 5,196 మంది కోలుకున్నట్టయింది. మరో 6,147 మంది చికిత్స పొందుతున్నారు.తాజాగా 10 మంది మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ఒకరు, విశాఖ జిల్లాలో ఒకరు మరణించారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా మృతుల సంఖ్య 146కి చేరింది.

Related posts