ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆర్ ఆర్ ఆర్ మేనియా నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది .
ఈ సినిమా అంచనాలకు మించి వుందంటూ ప్రేక్షకులు నుంచి సెలబ్రిటీల వరకు అంతా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే పలు చోట్ల బెనిఫిట్ షోలు కూడా పడ్డాయి. సెలబ్రిటీలు సినిమాపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఈ క్రమంలో ఆర్ ఆర్ ఆర్ మూవీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పెషల్ ట్వీట్ చేశారు. ‘‘ఈ వారంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను కుటుంబ సభ్యులతో చూస్తా అని ట్వీట్ చేశారు.
అంతేకాకుండా సరి కొత్త రికార్డ్స్ బద్దలు కొట్టాలని ఆశిస్తున్నా. సినిమా రివ్యూలు సూపర్ అని రావడం సంతోషం గా ఉంది. హీరోలు తారక్, రాంచరణ్, దర్శకుడు రాజమౌళి చిత్ర బృందనికి నా అభినందనలు’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
I will definitely watch it this week with my family and wish for the movie to break records. All the best guys!(2/2)
— Lokesh Nara (@naralokesh) March 25, 2022
అలాంటి నిర్మాతలు నా దగ్గరకు రావొద్దు… త్రివిక్రమ్ ను నేనే హైదరాబాద్ తీసుకొచ్చా.. : సునీల్